ముంబై: మరో మాంద్యం దిశగా ప్రపంచం పయనిస్తోందా? అమెరికా, యూరప్లతో సహా అన్ని దేశాలూ మరోసారి కష్టాలను ఎదుర్కొనక తప్పదా? యూరోజోన్లో విషమిస్తున్న పరిస్థితులు, స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు.. ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. అమెరికా జోరుకు బ్రేకులు, యూరోజోన్ సంక్షోభం నేపథ్యంలో బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లు విపరీతంగా ప్రవర్తించాయి. ఒక దశలో 587 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు కోలుకొని రెండేళ్ల కనిష్ఠానికి దిగజారింది.
వరుస పతనాలకు మంగళవారం బ్రేకు పడినా.. అంతర్జాతీయంగా వెలువడిన ప్రతికూల వార్త లు సెంటిమెంటును మరోసారి దెబ్బతీసాయి. ఎఫ్ఐఐలు అమ్మకాలకు పోటీపడ్డారు. ఎంతవేగంగా డాలర్లను ఇం డియా నుంచి తరలించుకుపోతే అంత మంచిది అన్నట్లు దూకుడు ప్రదర్శించారు. ఫలితం.. ఒకేరోజు సెన్సెక్స్కు 365 పాయింట్ల నష్టం..
ఒక్క మంగళవారం రోజే ఎఫ్ఐఐలు నికరంగా రూ. 952.68 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. మొత్తం ఐదు సెషన్లలో రూ. 2356 కోట్ల విలువ చేసే షేర్లను వదలించుకున్నారు.
కుప్పకూలిన షేర్లు.. పతన ఉధృతి అన్ని రంగాల్లో స్పష్టంగా కనిపించింది. బిఎస్ఇలోని 13 రంగాల సూచీల్లో 12 సూచీలు నష్టాల్లోనే ముగిసాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీ ఒక్కటే ఇందుకు మినహాయింపు. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టిపిసి ఒక్కటే లాభాల్లో క్లోజైంది. ఎఫ్ఐఐల దెబ్బకు క్యాపిటల్ గూడ్స్, ఐటి, రిఫైనరీ, బ్యాంకింగ్, విద్యుత్, మెటల్ షేర్లు విలవిల్లాడాయి. బుధవారం నాడు సెన్సెక్స్ నష్టాలతోనే ట్రేడింగ్ను ప్రారంభించింది. ఒక దశలో 15,478 పాయింట్లకు క్షీణించిన సెన్సెక్స్ చివరకు అమ్మకాల మద్ధతు లభించడంతో 15,699 వద్ద ముగిసింది. మొత్తం మీద సెన్సెక్స్ 2.27 శాతం నష్టపోయింది. మార్కెట్ల పతనం దిగ్గజాల్లో స్పష్టంగా కనిపించింది. మార్కెట్ దిగ్గజం రిలయన్స్తో సహా అన్ని రంగాల దిగ్గజాలు కుప్పకూలిపోయాయి.
కేవలం 14 కంపెనీలే సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోవడానికి కారణమయ్యాయి. భారీగా నష్టపోయిన షేర్లలో జ్రైపకాష్ 5.05 శాతం, హెచ్ డిఎఫ్సి బ్యాంక్ 3.85 శాతం, భారతి ఎయిర్టెల్ 3.70 శాతం, భెల్ 3.58 శాతం, ఎల్ అండ్ టి 2.85 శాతం, విప్రో 3.17 శాతం మేర నష్టపోయాయి. ఇది ప్రపంచ సంక్షోభం : రూపాయి పతనంతో సెంటిమెంటు క్షీణించినట్లు కనపడుతున్నా.. నిజానికి ఇది గ్లోబల్ మార్కెట్ల దెబ్బ. ఉత్పత్తి రంగంలో వృద్ధిరేటు క్షీణిస్తుందనే చైనా అంచనాలు, అమెరికా జిడిపి జోరు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం, యూరో జోన్లో సంక్షోభ పరిస్థితులు స్పష్టంగా కనపడటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.
ఈ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఒక దశలో సెన్సెక్స్ 587 పాయింట్లకు పైగా పతనం కావడానికి ప్రధాన కారణం ఇదే.. నిజానికి ట్రేడింగ్ చివరలో అన్ని రంగాల షేర్లకు మద్ధతు లభించింది. లేకపోతే నష్టాలు మరింత అధికంగా ఉండేవి. మూడో త్రైమాసికంలో జిడిపి జోరును 2.5 శాతం నుంచి రెండు శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వార్తలే మార్కెట్లను ముంచేశాయి. ఆసియాలోని ప్రధాన మార్కెట్లైన చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ ఎక్స్ఛేంజీలు 2.77 శాతం వరకూ పతనమయ్యాయి. జర్మనీ బాండ్లను విక్రయిస్తుందనే వార్తలు యూరోజోన్ సంక్షోభానికి పరాకాష్ఠగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
యూరోపియన్ దేశాలు కుప్పకూలిపోవడానికి రంగం సిద్ధమైందనే వార్తలు ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. మొత్తం మీద మరో మాంద్యానికి ప్రపంచం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.
2జి స్పెక్ట్రమ్ కంపెనీల జోరు : 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన ఆర్కామ్, యూనిటెక్, డిబి రియల్టీలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మార్కెట్లో సెంటిమెంటు పటిష్టమైంది. దీనితో ఈ కంపెనీల షేర్లు 20 శాతం వరకూ పెరిగాయి. ఈ వార్తలు వెలువడిన మరుక్షణమే డిబి రియల్టీ షేరు 19.96 శాతం పెరగ్గా, యూనిటెక్ 9.86 శాతం పెరిగింది
--
k.karthik
www.Ldcomputers.in
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment